*వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు జాగ్రత్త* పెద్దశంకరంపేట్ ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ కార్యాలయం లో మాట్లాడుతూ ఇతరుల మనో భావాలను దెబ్బతీసే విధంగా దుష్పచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు. ఏదైనా వర్గాన్ని కించపరిచేలా తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం. షేర్ చేయడం నేరంగా పరిగణించ బడుతుందని అన్నారు. ఏ గ్రూపులోనై ఇలాంటి పోస్టులు షేర్ అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణిస్తామని తెలిపారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. అనుచిత పోస్ట్ లు ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడతాయని పెర్కొన్నారు. అందువలన సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేకూర్చే విధంగా మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద శంకరంపేట్ ఎస్సై ప్రవీణ్ రెడ్డి హెచ్చరించారు.